Allu Arvind Hosted Party For Mahanati Team

  • 6 years ago
Popular producer Allu Arvind, who owns Geetha Arts, hosted a private party for the makers of Mahanati to celebrate the success of the film, which was a sweet gesture from the veteran producer. The party was attended by producers Aswini Dutt, Swapna Dutt and Priyanka Dutt along with director Nag Ashwin. Actor Allu Arjun too graced the party and posted a picture on his social networking page late in the night yesterday. Baahubali director S.S.Rajamouli too attended the event along with music composer M.M.Keeravani.


ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. సినిమా విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. యూఎస్ఏలో ఈ చిత్రం ఐదు రోజుల్లోపే 1 మిలియన్ డాలర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం వసూళ్లు అదుర్స్ అనే విధంగా ఉన్నాయి. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు గొప్ప సినిమా తీశారంటూ ప్రముఖుల నుండి, సినీ విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చిరంజీవి చిత్ర బృందాన్ని సత్కరించగా, తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో మహానటి నిర్మాతలు అశ్వినీ దత్, ప్రియాంక దత్‌, స్వప్నదత్‌తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ పార్టీలో అల్లు అర్జున్, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి సైతం పాల్గొని సందడి చేశారు.
‘మానాన్న గారు ఆయన స్నేహితుడు, భాగస్వామి అశ్వినీ దత్‌గారికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ‘మహానటి' లాంటి ఎంతో గొప్ప సినిమాను ప్రేక్షకులకు అందించారాయన, దర్శకుడు నాగ్ అశ్విన్ మనమంతా గర్వపడే సినిమా తీశారు. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్.... అంటూ అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు.
‘మహానటి' చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల సత్కరించిన సంగతి తెలిసిందే. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇంత గొప్ప సినిమా తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ టాలెంట్‌ను మెచ్చుకున్నారు.

Recommended